కన్నుగీటి రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్గా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె మొదటి చిత్రం “ఒరు ఆడార్ లవ్” గత ఏడాది విడుదలైంది. ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్ధుల్ రవూఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఒరు ఆదార్ లవ్”. ఈ చిత్రంలో ఇద్దరి నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే వీరిద్దరు సినిమా రిలీజ్కి ముందు, సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువగా కలిసి కనిపిస్తుండడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా ? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే… అంతకు మించి ఏమి లేదు అని స్పష్టం చేశారు. అయితే ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా రోషన్ని గట్టిగా హగ్ చేసుకొని దిగిన ఫోటోని తన ఫేస్బుక్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్స్లో మరోసారి చర్చ మొదలైంది. ఇద్దరి మధ్య ఏమైన నడుస్తుందా ? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రియా ప్రకాశ్ త్వరలో నితిన్ 28వ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది.
విజయశాంతి కోసం కమల్ హాసన్ లా తిరిగాను… అయినా… : అనిల్ రావిపూడి