ఏపీలో వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తున్న ఏకైక నాయకుడు అంటూ జగన్ ను కొనియాడారు. సీఎం జగన్ ఏడాది పాలనను స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనం అంటూ అభివర్ణించారు.
మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఏడాది కాలంలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన అనితర సాధ్యుడు సీఎం జగన్ అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. అత్యధిక శాతం సంక్షేమ ఫలాలను మహిళలకే అందిస్తూ ఆడపడుచుల ఆత్మబంధువై నిలిచారని రోజా ప్రశంసించారు.