telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా బారిన పడిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు…

ycp ap

ఏపీలో రోజుకు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. వారు వీరు అనే తేడా లేకుండా కరోనా అందరిని తమ చెంతన చేర్చుకుంటుంది. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ లో ఇప్పటికే చాలా మంది రాజకీయనాయకులు ఈ వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వారిరువురు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఏపీలో నిన్న కూడా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts