telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం : సీఐ దంపతులు మృతి

రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా   హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగర శివార్లలోని అబ్దుల్లాపూరమేట్ వద్ద ఇవాళ ఉదయం.. ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే.. మృతి చెందిన వారు హైదరాబాద్ సుల్తాన్ బజార్ సిఐ ఎస్. లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ అని సమాచారం అందుతోంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో సిఐ భార్య మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సిఐ కుటుంబందే నిర్లక్ష్యమని తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts