telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోగస్ ప్రిస్క్రిప్షన్‌తో సుశాంత్ కు వైద్యం… ప్రియాంకపై రియా సంచలన ఆరోపణ

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసుపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతున్న క్రమంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకొస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై అటు నార్కోటిక్‌ బ్యూరో అధికారులు, ఇటు సీబీఐ అధికారుల విచారణ సాగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణలో భాగంగా.. తాను డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు అంగీకరించింది రియా. అయితే డ్రగ్స్ అతనికి మాత్రమే ఇచ్చానని, తాను మాత్రం తీసుకోలేదని రియా చెప్పుకొచ్చింది. దీంతో సుశాంత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ కోణం ఉందని ఓ నిర్దారణకు వచ్చిన ఎన్‌సీబీ ఆఫీసర్స్ దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ కాగా, ఈ రెండు మూడు రోజుల్లో రియా చక్రవర్తిని కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకోనుందని తెలుస్తోంది. ఇంతలో సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకపై సంచలన ఆరోపణ చేస్తూ రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు ఫైల్ చేయడం ఈ కేసులో ఊహించని మలుపుగా మారింది. సుశాంత్‌కు సంబంధించి బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ఇచ్చారని పేర్కొంటూ సుశాంత్ సోదరి ప్రియాంకపై, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్‌పై సోమవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది రియా చక్రవర్తి. ఈ ప్రిస్క్రిప్షన్ వచ్చిన ఐదు రోజుల్లోనే సుశాంత్ చనిపోయాడని తన ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరిపై వెంటనే సరైన విచారణ జరపాలని ఆమె కోరింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని తెలిపిన రియా.. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తేదీ (జూన్ 8) సుశాంత్ ముంబైలోనే ఉన్నాడని రియా పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది. కాగా ఇది తప్పుడు ఆరోపణ అని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఖండించారు.

Related posts