లెజండరీ సింగర్, గానకోకిల లతా మంగేష్కర్ (92) కన్నుముశారు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జనవరి 8న కరోనాతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుముశారు.
కోవిడ్-19, న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె దాదాపు నెల రోజులుగా లతాజీ ఐసీయూలో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్యం చేసింది.
తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.
కంగనాపై శివసేన నేత తీవ్ర వ్యాఖ్యలు