మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గొడవ ఇప్పట్లో ఎండ్ ఆయ్యేటట్టు కనిపించడంలేదు. రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మా ఎన్నికల్లో మంచు విష్ణుపై పోటీ ఓటమి పాలైన ప్రకాశ్రాజ్.. పోలింగ్ రోజు జరిగిన గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు లేఖ రాశారు. పోలింగ్ రోజు మోహన్బాబు దురుసుగా ప్రవర్తించారని అన్నారు.
మోహన్బాబు, నరేశ్ తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని, సీసీ దృశ్యాలు చూస్తే అసలు విషయాలు తెలుస్తాయని ప్రకాశ్రాజ్ లేఖలో పేర్కొన్నారు. దయచేసి వీలైనంత త్వరగా గొడవకు సంబంధించిన ఫుటేజ్ ఇవ్వాలని కోరారు. ఆ వీడియోలను మోహన్బాబు తొలగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు పెట్టినట్లు చెప్పారు కాబట్టి.. ప్రతి ఒక్కరూ వ్యవహరించిన తీరు అందులో రికార్డ్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలు జరిగిన రోజు మోహన్బాబు, నరేశ్ కొందరిపై చేయిచేసుకున్నారని ప్రకాశ్రాజ్ అన్నారు. వీరిద్దరూ తమను బెదిరించారని చెప్పారు. అసలేం జరిగిందో ‘మా’ సభ్యులకు తెలియాలని తాను అనుకుంటున్నట్లు ప్రకాశ్రాజ్ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతీ సమాచారం అడిగి తెలుసుకునే హక్కు తమకుందన్నారు ప్రకాష్రాజ్. పోలింగ్ ఆఫీసర్గా అన్ని రికార్డుల్ని మూడు నెలల పాటు భద్రపరచాల్సిన డ్యూటీ ఈసీదని గుర్తు చేశారు.
కాగా..ప్రకాశ్రాజ్ లేఖపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. ఎన్నికల సీసీ ఫుటేజ్ భద్రంగానే ఉందని అన్నారు. నిబంధనల ప్రకారం ఆ ఫుటేజ్ను ప్రకాశ్రాజ్కు ఇస్తామని స్పష్టం చేశారు.
సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్…!