బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. సుశాంత్ మరణించిన 45 రోజుల తరువాత… సుశాంత్ తండ్రి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేయడం, రియా కన్పించకుండా పోవడం, పోలీసులకు సంబంధించిన వీడియో లీక్ కావడం తదితర అంశాలు చూస్తుంటే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఖచ్చితంగా ఇది హత్యేనని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని చాలామంది కోరుతున్నారు. అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఈ కేసు దర్యాప్తును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్ వేసింది. ఇందులో ఆమె ఆసక్తికర విషయాలు తెలిపింది. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని, గత నెల 8న సుశాంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది. కుంగుబాటుతో బాధ పడుతున్న సుశాంత్ మందులు వాడేవాడని చెప్పింది. గత నెల బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. సుశాంత్ మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే తన వాంగ్మూలం నమోదు చేశారని, అయినప్పటికీ పాట్నాలోనూ కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందని ఆమె తెలిపింది. సుశాంత్ తండ్రికి బీహార్లో పలుకుబడి ఉందని, దీంతో కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరింది.
previous post
అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా… రామ్ గోపాల్ వర్మ సంచలన వర్మ