telugu navyamedia
తెలంగాణ వార్తలు

బరువెక్కిన హృద‌యంతో భ‌ర్త కృష్ణంరాజు పాడె మోసిన భార్య శ్యామలాదేవి

*మొయినాబాద్‌కు చేరుకున్న కృష్ణంరాజుకు భౌతికకాయం..
*కనకమామిడి ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు

టాలీవుడ్ సినీయర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మ‌రికాసేట్లో ఆయన అంత్యక్రియలను మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్వహించబోతున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు.

జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం  నుంచి ఫామ్‌హౌస్‌కు త‌ర‌లించేముందు తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Krishnam Raju | Facebook

కృష్ణంరాజుకి శ్యామలాదేవికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఎక్కడికి వెళ్లినా.. ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కృష్ణంరాజు అంటే శ్యామలాదేవికి ఎంతో ప్రేమ. తన లైఫ్ లో ఆయన పెద్ద గిఫ్ట్ అని చెబుతుంటారామె. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం ఆమె తట్టుకోలేకపోతున్నారు. 

కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. ఇందుకోసం ప్రభుత్వం కనకమామిడిలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాట్లు చేసింది.త‌న అభిమాన న‌టుడు కృష్ణంరాజు చివరిచూపు కోసం అభిమానులు తరలివచ్చారు.

Related posts