telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

puvvada ajay

ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం బస్‌ డిపోను ఈ రోజు మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆర్టీసీ కార్మికులు ఘనస్వాగతం పలికారు. బస్‌ డిపో ఎదుట సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి అజయ్‌, కార్మికులు పాలాభిషేకం చేశారు.

అనంతరం మంత్రి కార్మికులకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు రానున్న రోజుల్లో ఆర్టీసీ లాభాల బాటలో నడిపిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు సింగరేణి, విద్యుత్‌ ఉద్యోగుల స్థాయిలో భవిష్యత్‌ ఉంటుంది. కార్మికుల పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts