టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో
రవిప్రకాశ్ ను గత మూడు రోజులుగా సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు రవిప్రకాశ్ ఈరోజూ హాజరయ్యారు.
డిజిటల్ సంతకం ఫోర్జరీకి చేసినట్టు రవిప్రకాశ్ అంగీకరించారు. ఏవిధంగా ఫోర్జరీకి పాల్పడింది పోలీసులకు వివరించి చెప్పినట్టు సమాచారం. ఎందుకు ఫోర్జరీ చేశారన్న పోలీసుల ప్రశ్నకు రవిప్రకాశ్ నోరుమెదపలేదని తెలుస్తోంది. మూడు రోజుల విచారణలో పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాశ్ స్పందించలేదు. రవిప్రకాశ్ తమ విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పడం తెలిసిందే.