స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నసీర్ జెంషెడ్కు 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. పాకిస్థాన్ సూపర్ లీగ్లో జెంషెడ్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. జెంషెడ్తో పాటు బ్రిటీష్ జాతీయులు యూసెఫ్ అన్వర్, మొహమ్మద్ ఇజాజ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేషనల్ క్రైం ఏజెన్సీ ముందు.. తమ నేరాలను ఈ ముగ్గురూ అంగీకరించారు. పాక్ సూపర్ లీగ్లో ప్లేయర్లు సరైన ప్రదర్శన ఇవ్వకుండా ఉండేందుకు జెంషెడ్.. వారికి ముడుపులు ఇవ్వచూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిక్సింగ్లో భాగంగా అన్వర్, ఇజాజ్లు ప్లేయర్లకు ఆర్థిక సాయం చేసేవారు. ఈ కేసులో అన్వర్కు 40 నెలలు, ఇజాజ్కు 30 నెలల శిక్ష పడింది. 2018 ఆగస్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్పై పదేళ్ల నిషేధం విధించింది.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా: లక్ష్మీనారాయణ