telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్‌ షూటింగ్‌లో బిజీ అయిపోయిన రష్మిక

లక్కీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ ఎంట్రీఇవ్వనున్న విషయం తెలిసిందే. అందుకుగాను బాలీవుడ్‌లో తన మొదటి సినిమా చిత్రీకరణ మొదలైంది. 2020తో పాటు 2021 కూడా రష్మికకి లక్కీ ఇయర్‌గా మారింది. కరోనా కారణంగా గతేడాది టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు విడుదల కాలేదు. కానీ రష్మిక స్టార్ కథానాయికల జాబితాలో చేరింది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో గతేడాది మొదటి నుంచే తన లక్‌ను చూపించింది. దాంతో ఈ బ్యూటీకి భారీ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భామ అల్లుఅర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కథానాయికగా చేస్తుంది. దీంతోపాటు కార్తీ సినిమా సుల్తాన్ ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలతో టాలీవుడ్‌లో బాగా బిజీగా ఉన్న హీరోయిన్‌గా మారింది. ఇంతలో బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. బాలీవుడ్‌లో తన మొదటి సినిమా మొదలు కాకముందే మారో అవకాశాన్ని పట్టేసింది. అది కూడా లక్కీ బ్యూటీ బాలీవుడ్‌లో తన రెండో అవకాశాన్ని బిగ్ బీ సరసన కోట్టేసింది. అందులో అమితాబ్ బచ్చన్ కూతురు పాత్రలో కనిపించనుంది. అయితే ఇటీవల రష్మిక తన బాలీవుడ్ ఎంట్రీ సినిమా మిషన్ మజ్ను సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన రష్మిక హీరో సిద్దార్థతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Related posts