telugu navyamedia
సినిమా వార్తలు

రాజమౌళి కాళ్లు మొక్కిన బాలీవుడ్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Brahmastra Motion Poster Launch | These celebs including Ranbir-Alia, SS  Rajamouli, arrived in Hyderabad for the Telugu poster launch of 'Brahmastra'  CB News | crazybollywood.com

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా రణ్​బీర్​​ నటిస్తున్న భారీ బడ్జెట్​ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దక్షిణాది మోషన్ పోస్టర్​ను జక్కన్న విడుదల చేశారు.

ఈ సందర్బంగా రణ్‌బీర్ వేదిక‌పైకి రాగానే రాజమౌళి కాళ్లు మొక్కడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రణ్‌బీర్‌ చూపిన వినయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రపంచంలోనే తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని చెప్పారు రణ్​బీర్​ అన్నారు. దేశంలో ఆయనే నెం.1 అని కొనియాడారు. దక్షిణాదిలో ‘బ్రహ్మాస్త్ర సినిమాని రాజమౌళి ప్రెజెంట్​ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అమితాబ్​ తర్వాత అతిపెద్ద నటుడు నాగార్జున. ఆయన కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయనంటే నాకు ఎంతో ఇష్ట మ‌ని అన్నారు.

కాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌9న విడుదల చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నాడు.

Related posts