ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ‘అరణ్య’ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోన్న కారణంగా ప్రజల భద్రత దృష్ట్యా సినిమాను వాయిదా వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మా భాగస్వాములు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ, మనందరి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ కోరుకుంటూ, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాం. ఆరోగ్యంగా, భద్రంగా ఉండండి’’ అని ప్రకటనలో నిర్మాతలు తెలిపారు.