ఈ మధ్య విపరీతంగా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ.. మహేష్ బాబు, రవితేజ వంటి హీరోలు నాకొచ్చిన అవకాశాలను కొట్టేశారంటూ వింతవింతగా మాట్లాడిన సునిశిత్, హీరోలనే కాకుండా హీరోయిన్లను కూడా అతని అరాచకంలోకి లాగాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లైందని మా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆమెను గుళ్లో పెళ్లి చేసుకుని కాపురం చేశానని.. ఐదునెలల్లో మూడు సార్లు అబార్షన్ చేయించా అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ పిచ్చిపిచ్చి కూతలు కూశాడు. అంతేకాదు యాంకర్ ప్రదీప్తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ కావాలంటే ఆమెకు ఫోన్ చేసి అడగండి అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేసి యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యాడు. హీరోయిన్ తమన్నాను సైతం పెళ్లి చేసుకున్నా అంటూ పిచ్చి కామెంట్స్ చేశాడు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చింది. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనతో పెళ్లైందని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది లావణ్య త్రిపాఠి. ఈ కేసుని తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సునిశిత్ స్టేషన్కు తీసుకురావమే కాకుండా అతనితో ఇంటర్వ్యూలు చేసిన వివిధ యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ని, ఆ ఛానల్స్ నిర్వాహకుల్ని కమీషనర్ ఆఫీస్కి తీసుకువస్తున్నారు. ఈ ఇష్యూపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్స్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. మహిళల్ని కించపరిస్తే జైల్లో వేయడం ఖాయం అని అన్నారు.
previous post
next post