మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. “రామ్” అనే టైటిల్తో మోహన్ లాల్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో మోహన్ లాల్తో త్రిష జోడి కడుతుంది. ఫ్యాషన్ స్టూడియోస్ మరియు అభిషేక్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీతూజోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్లో “దృశ్యం” చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసింది. తెలుగుతో పాటు పలు భాషలలో ఈ మూవీ రీమేక్ అయ్యి అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం “రామ్” 2020 ఓనమ్ పండుగ సందర్భంగా విడుదల కానుంది.
previous post
ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు