యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఓటు హక్కు పైన తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ లిక్కర్ కోసం ఓటు అమ్ముకునే వారికి ఓటు హక్కు ఉండరాదన్నాడు. అటు ధనవంతులకు కూడా ఓటు హక్కు అవసరం లేదని తెలిపాడు. కేవలం చదువుకున్న మిడిల్ క్లాస్ వారికే ఓటు విలువ తెలుసని, వారికే ఇది ఉండాలన్నాడు. విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఈ అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తుంటే ఇంకొందరు మాత్రం విజయ్ కామెంట్లను తప్పుబడుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చార్మీ రూపొందిస్తున్నారు. సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.
Did he just say that he prefers Dictatorship more than democracy and not everyone should be allowed to vote?
Deverakonda is a classic example of how apolitical folks slowly move towards RW Authoritarianism in the end. pic.twitter.com/JsNmZ0f1GS
— Advaid അദ്വൈത് (@Advaidism) October 9, 2020