బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ కు ఎన్సీబీ నోటీసులు అందాయి. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇక వీరితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కు నోటీసులు అందాయి. అయితే రకుల్కు ఎలాంటి నోటిసులు అందలేని ఆమె టీమ్ మొదట ప్రకటించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే తనకి సమన్లు అందాయని, శుక్రవారం విచారణకు హాజరవుతున్నానని రకుల్ వెల్లడించినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే నేడు రకుల్, శనివారం దీపికా పదుకొనే, ఆదివారం శ్రద్ధా కపూర్, సారా ఆలీఖాన్ లు ఎన్సీబీ ముందు విచారణకు హాజరుకానున్నారు. గోవా షూటింగ్ లో ఉన్న దీపిక గురువారం సాయంత్రం ముంబై చేరుకుంది. శనివారం దీపికా పదుకొనే ఎన్సీబీ ఎదుట హజరుకానుంది.
previous post