telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త భయం.. బ్లాక్ ఫంగస్ ముప్పు !

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఈ బ్లాక్ ఫంగల్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి కొలుకున్నవారిలో ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఢిల్లీలోని గంగారం ఆస్పత్రిలో రెండు రోజుల్లో 6 కేసులు నమోదయ్యాయి. స్టెరాయిడ్స్ ఉపయోగించిన వారిలో ఈ ఫంగల్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్ వైద్యులు గుర్తించారు. ఫస్ట్ వేవ్ నుంచి కోలుకున్న వారిలో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోందని వారు తెలిపారు.

Related posts