telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్సీబీ విచారణ కోసం ముంబై చేరుకున్న దీపికా

Deepika

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌ కు ఎన్సీబీ నోటీసులు అందాయి. అయితే నేడు రకుల్, శనివారం దీపికా పదుకొనే, ఆదివారం శ్రద్ధా కపూర్, సారా ఆలీఖాన్ లు ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి గురువారం రాత్రి గోవా నుంచి ముంబైకు వచ్చారు. ఈ నెల 26వ తేదీన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల దర్యాప్తునకు దీపికా హాజరు కానున్నారు. సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల పాత్ర గురించి ఎన్సీబీ అధికారులు శుక్రవారం దీపికా మేనేజరు కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించనున్నారు. ఎన్సీబీ సమన్లు జారీ చేసిన మరో బాలీవుడ్ నటి సారాఅలీఖాన్ గురువారం ముంబై నుంచి గోవాకు విమానంలో వెళ్లారు.

Related posts