telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానులందరూ ఉన్నంత కాలం నాన్న మాతోనే ఉంటారు : ఎస్పీ చరణ్

SPB

ఐదు దశాబ్దాలకు పైగా తన మధురగానంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. ఆయన మరణవార్తతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎస్పీబీ కన్నుమూశారని చరణ్ వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ తన కుటుంబం తరపున కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. ఎస్పీబీని కాపాడేందుకు ఎంతో కృషి చేసిన ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అభిమానులందరూ ఉన్నంత కాలం నాన్న తమతోనే ఉంటారని, ఆయన పాట నిలిచే ఉంటుందని చెప్పారు. ఇక ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, పోలీసులు చేరుకున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు బాలుకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

Related posts