దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుక ఘనంగా జరిగింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రక్షా బంధన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.
అందులో భాగంగానే..మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగష్టు 22న చిరు పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబంలో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్చరణ్, సాయితేజ్ ఇలా మెగా కుటుంబం అంతా ఒకచోట చేరి సందడి చేశారు. . ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్లు ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలాగే మహేష్ గారాల పట్టి సితార తన అన్నయ్య గౌతమ్పై తనకున్న ప్రేమను చాటింది. ఇందుకు సంబంధించిన ఫొటోని నమ్రత షేర్ చేయగా, ఇందులో ఇద్దరు చిన్నారులు చాలా క్యూట్గా కనిపిస్తున్నారు.
పవన్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య.. అన్నయ్య అకీరాకి రాఖీ కట్టింది. అల్లు అర్జున్ ముద్దులు కూతురు అర్హ.. తన అన్నయ్య అయాన్కి రాఖీ కట్టిన పిక్స్ స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అవుతున్నాయి. చేసింది. స్టార్స్తో పాటు స్టార్ కిడ్స్ రాఖీ సెలబ్రిట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సందర్భాన్ని బట్టి తాము పార్టీలు మారాం: రాజశేఖర్