సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం’సేనాపతి’. డిసెంబర్ 31న ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది.
తాజాగా ..ఈ చిత్రంలో ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. .నిజాయితిగా బ్రతకం మన నిర్ణయం కృష్ణ..నువ్వు ఎక్కడున్నా..ఏం చేసినా మంచి – చెడు రెండూ చూడాలి, ఆ రెండింటి మధ్యే ఎదగాలి” అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది.
నువ్వు ఐపీఎస్కు ఫ్రిపేర్ అవుతున్నావట..కండక్ట్ రాయవల్సింది నేనే..ఒక క్రిమినల్ పట్టుకునే క్రమంలో నా గన్ పొగొట్టుకున్నాను..ఎవరు నువ్వు..నీ చావును రా లుచ్చా అంటూ రాజేందర్ప్రసాద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇదేంటో తెలుసా ..సేనాపతి ..దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ట్రైలర్ లో అనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
పోలీస్ లకు .. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు…కృష్ణమూర్తి .. ఆ తరువాత సేనాపతిగా మారతాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. విష్ణు ప్రసాద్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. శ్రావణ భరద్వాజ్ సంగీతం అందించారు.
ఎన్నికల్లో జనసేన ఓటమి… స్పందించిన చరణ్