బాలీవుడ్లో పోర్నోగ్రఫీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్నోగ్రఫీ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
అయితే కొత్తగా మరో నటి పుట్టుకొచ్చింది. అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్షాట్స్ యాప్లో రాజ్కుంద్రా విడుదల చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాజ్కుంద్రా మంచి వ్యక్తి కాదని.. తనకిచ్చిన మాట తప్పాడని ఆమె వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రైవేట్ పార్ట్స్ని వీడియోలో చూపించకూడదు అనే షరతుతో రాజ్కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని.. అందుకుగాను కుంద్రా తనకి కొంత మొత్తాన్ని చెల్లించాడని ఆమె పోలీసుల ఎదుట వాపోయారట.
అయితే, ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ఏవిధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్షాట్స్లో విడుదల చేశారని ఆమె వివరించింది. ఈ మేరకు నటి షెర్లిన్ చోప్రా నుంచి తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్టేట్మెంట్ స్వీకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాజ్కుంద్రా, ఆయనకు చెందిన సంస్థల వల్ల ఈ కేసులో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయనే వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. దీంతోపాటు ఈ కేసు విచారణను సైతం సైబర్ పోలీసులు వేగవంతం చేశారు.