నటుడు, తన భర్త రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుంటున్నారని జీవిత రాజశేఖర్ మీడియా కు తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిన మాట వాస్తవమేనని , కాని వెంటిలేటర్పైన లేరని చెప్పారు. వైద్య బృందం చేస్తున్న కృషితో రాజశేఖర్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారని, త్వరలో ఐసీయు నుంచి బయటకు వస్తారని చెప్పారు. రాజశేఖర్ కోలుకోవాలని అభిమానులు, వెల్ విషెసర్స్ చేసిన ప్రార్థనల వల్లే ఇవాళ ఆయన చాలా విషమ పరిస్థితుల నుంచి బయటకు వచ్చారని అన్నారు జీవిత రాజశేఖర్. కాగా.. టాలీవుడ్ జంట రాజశేఖర్ , జీవితతో పాటు వారి పిల్లలు కొన్ని రోజులు కింద కరోనా బారిన పడ్డారు. అయితే…కరోనా వైరస్ నుంచి జీవిత, వాళ్ల పిల్లలు కోలుకున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కరోనా భారీన పడ్డప్పటి నుంచి రాజశేఖర్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే రాజశేఖర్ ను ఆస్పత్రి లో చేర్చారు.
previous post
మన రాజ్యాంగం సక్రమంగా అమలు కాలేదు : ఈటల