గత ఏడాది నుండి కరోనా మన దేశాన్ని వణికిస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులు తగ్గుతాయి అనుకున్నారు. అలాగే మొదట్లో కేసులు తగ్గిన ఇప్పుడు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారీన పడ్డట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఆయన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ బారిన పడటం ఆందోళన కలిగించే అంశం. అల్లు అరవింద్ వ్యాక్సిన్ తీసుకోక ముందు కరోనా బారిన పడలేదు. ఇక రెండు డోస్ల వ్యాక్సినేషన్ వేసుకున్నా సరే.. కరోనా పాజిటివ్ వచ్చిన సినీ సెలబ్రిటీస్ లో అల్లు అరవింద్ మొదటి వారని చెప్పాలి. అయితే.. అల్లు అరవింద్ కరోనా పాజిటివ్ అని తెలియగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. వకీల్ సాబ్లో నటించిన హీరోయిన్ నివేదా థామస్కు ఇవాళ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
previous post