అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాజధాని మొత్తాన్ని విశాఖకు తరలించాలని భావిస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా రాజధాని తరలింపుపై గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ కొడాలి నాని వ్యాఖ్యలతో మరింత బహిర్గతం అయిందని అన్నారు.
కోర్టులో కేసులు వెనక్కి తీసుకోకుంటే ఈ చిన్న రాజధానిని కూడా తరలించేస్తామని కొడాలి నాని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పితృభాష ఎక్కువగా వాడుతున్నారని దుయ్యబట్టారు. కోర్టులో ఉన్న ఓ అంశం గురించి మంత్రి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని రఘురామకృష్ణరాజు హితవు పలికారు.