telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైయస్ పథకాలకు జగన్ పంగనామాలు: సీపీఐ నారాయణ

CPI Narayana

ఏపీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ఎత్తేసేందుకే విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాలకు జగన్ పంగనామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల హామీలను జగన్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ అనేక విషయాల్లో మాట తప్పారని దుయ్యబట్టరు.కేసుల సుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా జగన్ మారిపోయారని నారాయణ విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. జీఎస్టీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర విధానాల పట్ల ముఖ్యమంత్రులు తిరగబడే పరిస్థితి వచ్చిందని అన్నారు. జగన్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Related posts