telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దు.. వైసీపీకి రఘురామకృష్ణరాజు హితవు

Raghuramakrishnaraju ycp mp

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవించకపోతే ఆర్టికల్ 356 ఉపయోగించి ఏపీలో రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితి రావొచ్చని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.  న్యాయ వ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

న్యాయ వ్యవస్థతో పెట్టుకోవద్దని, ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. న్యాయవ్యవస్థను గౌరవించాలని ఇటీవల వైఎస్.విజయమ్మ రాసిన బుక్‌లో కూడా న్యాయ వ్యవస్థను కించపరుస్తూ, దుర్భాషలాడుతూ కొంత మంది వైసీపీ నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలను తీసుకుంటుంటారని ఆరోపించారుగుర్తుంచుకోవాలని సూచించారు.

Related posts