telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాదయాత్రకు సిద్ధమైన మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు..

తెలంగాణలో వరుసగా కాంగ్రెస్‌ నేతలు ప్రజాసమస్యలు పరిష్కరించాలని పాదయాత్రల బాట పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో మరో ఇద్దరు నేతలు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19 నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో కోమటిరెడ్డి ఈ పాదయాత్రను చేస్తున్నారు. నార్కట్ పల్లి నుండి slbc వరకు పాదయాత్రకి సిద్ధమైతున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈ మేరకు పాదయాత్రకు అనుమతి కోరుతూ ఈసీకి కోమటిరెడ్డి లేఖ కూడా రాశారు. అంతేకాదు… ఈ నెల 22 నుండి వారం పాటు జగ్గారెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. సదాశివపేట నుండి గన్ పార్క్ వరకు పాదయాత్రకు జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అచ్చంపేట నుండి పాదయాత్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అటు ఆదిలాబాద్ నుండి సీఎల్పీ నేత భట్టి రైతు ముఖాముఖి నిర్వహిస్తున్నారు.

Related posts