ఇటీవల నకిలీ పత్రాలతో దేశంలో అడుగుపెట్టారని అమెరికా 29 మంది భారత విద్యార్థులను ఖైదు చేసిన విషయం తెలిసిందే. అందులో కొందరికి ఊరట లభించింది. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు, ఎఫ్బీఐ కలిసి ఏర్పాటు చేసిన నకిలీ యూనివర్శిటీ ఫర్మింగ్టన్ ఉచ్చులో పడ్డ 8 మంది తెలుగు విద్యార్థులు బయటపడ్డారు. వీరి కేసు కోర్టుకు రావడంతో వారంతా తాము స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయమూర్తికి చెప్పడంతో, వారు తిరిగి ఇండియా వెళ్లేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
అంతకుముందు ఈ కేసులో న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, మరోసారి అమెరికా రావాలని భావిస్తే, సరైన వీసా పత్రాలతో దర్జాగా రావచ్చని ఆయన తెలిపారు. కాగా, తమను జైలు నుంచి విడిపించేందుకు సహకరించిన తెలుగు సంఘాల ప్రతినిధులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇంకా 30 మంది వరకూ జైళ్లలో ఉండగా, మరో 50 మందికి పైగా జియో ట్యాగ్ అరెస్ట్ లతో బయట తిరుగుతున్నారు.
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్