లోక్ సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు వివిధ కారణాలతో పార్టీ నేతలు రాజీనామాలు చేసినప్పటికీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన అనంతరం.. కాంగ్రెస్ నేతల రాజీనామాలపై ప్రత్యేక దృష్టి పడింది.
తాజాగా అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో మరో కాంగ్రెస్ నేత పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీని వీడారు. మంగళవారం ఆమె పార్టీ వీడినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది.