శివసేన ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్వింద్ సావంత్ నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సావంత్ రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఆయన స్థానంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాపై బీజేపీ మాట మార్చిందని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. మా పార్టీకి నమ్మకద్రోహం చేసింది. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు.
టీపీసీసీ పదవిపై నాకు ఆసక్తి లేదు: వెంకటరెడ్డి