telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అద్భుతమైన మార్పు: కేటీఆర్‌

KTR TRS Telangana

తెలంగాణలో ఆరేళ్ల లోపే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అద్భుతమైన మార్పు కనిపిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్లు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తన ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలవడం.. తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భమని కేటీఆర్‌ అన్నారు.

దేశ వ్యాప్తంగా గోధుమలు, బియ్యం కొనుగోళ్లు చేసినట్లు ట్విట్టర్‌లో కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ పేర్కొన్నారు. 50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. 50 లక్షల టన్నుల బియ్యంలో తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేయగా, ఏపీ నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

Related posts