విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఘాటుగా స్పందించారు. సునామీ, హుద్ హుద్ , తిత్లీలు తట్టుకొన్న విశాఖలో నేడు ఎల్జీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ప్రజలు గ్రామాలు వదిలి భయం గుప్పెట్లో రోడ్లపై గడుపుతున్నారు. రాజప్రాసాదాల్లో ఉన్న నాయకులారా మీకు కనిపించడం లేదా పునరావాసం, ప్రభుత్వ సాయం అందించాలని? ఈ విషయాన్ని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ ట్విట్టర్లో ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గ్యాస్ లీక్ దుర్ఘటనతో విశాఖ శివార్లలోని గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయని వార్తా పత్రికల్లో రాశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీకి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలంతా తరలివెళ్లాలని ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించిందని, దీంతోదాదాపు 20 ప్రాంతాలకు చెందిన ఏడు లక్షల మంది తరలిపోయారని పేర్కొన్నారు.
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్