టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా టిక్టాక్ బానిసైంది. ప్రస్తుతం యూత్ అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అయితే అందులో టిక్టాక్ యాప్ తప్పనిసరి అయిపోయింది. అంతలా యూత్ దానికి కనెక్ట్ అయిపోయారు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఫేమ్ కూడా వస్తుంది కదా. ఇప్పటికే చాలమంది దానికి బానిసలైపోయారు కూడా. పొద్దులేచిన దగ్గర్నుంచి అందులోనే మునిగి తేలుతున్నారు. ఇప్పుడు రాశిఖన్నా అందులో జాయిన్ అయిపోయింది. అయితే ఇది రియల్ లైఫ్లో కాదు… రీల్ లైఫ్లో మాత్రమే. సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న “ప్రతీ రోజూ పండగే” సినిమాలో ఈ పాత్రలో నటిస్తోంది రాశీ. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో.. రాశీ.. పాత్ర ద్వారా.. ఫుల్ ఫన్ వస్తుందని మారుతి కొత్తరకంగా ట్రై చేస్తున్నారని సమాచారం. సాయిధరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది.
previous post
next post