telugu navyamedia
సినిమా వార్తలు

ఈనెల 13న మీ ముందుకు వస్తున్న ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ

స్నేహాచిత్ర పిక్చర్స్ యూనివర్సిటీ చిత్రం ఈనెల 13న విడుదల చేస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో వేసిన ప్రివ్యూ ను పలువురు ప్రముఖులు వీక్షించి యూనివర్సిటీ చిత్రం ఎడ్యుకేషన్ మీద తీసిన సినిమా, ఈ టైం లో రావాల్సిన మంచి సినిమా అని కొనియాడారు.
ప్రొఫెసర్ హర గోపాల్ గారు మాట్లాడుతూ…ఇది కేవలం విద్యార్థులే కాదు తల్లి దండ్రులు అధ్యాపకులు చూడాల్సిన చూపించాల్సిన సినిమా అని..గత 40 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మన దేశంలోనూ జరిగిన జరుగుతున్న సమస్యలకు స్పందించి ఆర్ నారాయణమూర్తి సినిమాలు తీస్తూ భావితరాలకు తెలిసేలా ఒక కలా నాళికల చరిత్రను నిక్షిప్తం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను అని అన్నారు.

ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ: మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ప్రాధమిక దశ నుంచి మాతృ భాషతో పాటు ఇంగ్లీష్ ను నేర్పుతూ వనరులు సమకుర్చీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఇస్తే ప్రభుత్వా విద్యారంగం భలో పేతమవుతుంది. ప్రవేట్ విద్య రంగం లేకుండ పోతుంది. విద్యార్థులను తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసే ఫీజుల దోపిడీ ఉండదు అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా చాలా గట్టిగా చెప్పారు నారాయణ మూర్తి.ఇది అందరూ చూడదగ్గ చిత్రమని అన్నారు.

ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారు మాట్లాడుతూ: విద్య హక్కు కోసం పని హక్కు కోసం రాజ్యాంగం కలిపించిన రిజర్వేషన్ లు అమలు కోసం అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని నిరుద్యోగ సమస్య ఈ దేశాన్ని ఎంత పట్టి పిడిస్తుందో ఈ చిత్రం ద్వారా బాగా చెప్పారు..

బీసి నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ: ఫీజుల దోపిడీ లేని చదువు రావాలి అంటే విద్యార్థుల చదువుల పట్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అంటే విద్యను వైద్యాను జాతీయం చేయాలనే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పయనించాలి అని ఈ చిత్రం ద్వారా చెప్పారు అని అన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ: ఆర్ నారాయణ మూర్తి గారు యూనివర్సిటీ అనే మంచి సినిమా తీశారు.ఈ సినిమా ని నా అభిమానుల తో పాటు అందరూ చూడాలి అని అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: చదువుకొనే రోజుల్లో పేపర్ లికేజ్ గ్రూప్ వన్ గ్రూప్ 2 లాంటి పరిక్షాల్లోనూ పేపర్ లికేజ్ లు .ఇలా అయితే విద్యార్థులు నిరుద్యోగులు ఎన్ని సార్లు పరీక్షలు రాయాలి. పరీక్షలు మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో అడుకోడం దుర్మార్గం. విద్యార్థులు జాతి సంపద. వాళ్ళను రక్షించికోవాల్సిన బాధ్యత సమాజం పై ఉంది. మనందరి పై ప్రభుత్వాల పై ఉంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీ శంకర్, పాశం యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కాశిం, బిసి నాయకులు గణేశ చారి, దర్శకులు కాశీ విశ్వనాథ్ , వైఎస్ కృష్ణేశ్వర రావు ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు ప్రివ్యూ చూసి సినిమాని అభినందించారు.

Related posts