telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అక్రమ నగదు, మద్యం పై పటిష్ట నిఘా ఉండాలి: ఎం.సి.సి నోడల్ అధికారి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి

ప్రలోభాల పై అప్రమత్తంగా ఉండాలి – ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ లకు శిక్షణ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ లకు ఎం.సి.సి నోడల్ ఆఫీసర్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి హెడ్ ఆఫీస్ లో శిక్షణ ను ఇచ్చారు

ఈ సందర్భంగా ఎం.సి.సి నోడల్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల షెడ్యూల్ నవంబర్ 9వ తేదీ విడుదలైన నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎం.సి.సి లో ఎఫ్.ఎస్.టి, వి.ఎస్.టి లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిన వారిపై తీసుకున్న చర్యల పై రోజువారీ నివేదిక అందించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, వారిని జి.పి.ఎస్ ట్రాక్ సిస్టం ద్వారా నిరంతరాయంగా పరిశీలిస్తామని తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మద్యం, లిక్కర్ తదితర వస్తువులు పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ వీడియో రికార్డ్ తప్పనిసరిగా చేయాలి తెలిపారు. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రి పై వీడియో సర్వేలెన్స్ టీమ్ లు రికార్డు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ లు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించాలని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ (డి.జి.సి హైదరాబాద్ కలెక్టరేట్) కు సమర్పించాలని తెలిపారు. ఈ సెల్ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదు ను సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం నగర ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉన్నదని, 50వేలకు పైబడి ఉన్న నగదు కు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉంది అన్న సమాచారం అందిన వెంటనే ఇన్ కం ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తమ ఖర్చును 40 లక్షలలోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.

ఎన్నికల వ్యయ మానిటరింగ్ నోడల్ అధికారి శరత్ చంద్ర మాట్లాడుతూ… ఎన్నికల అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని చూపించకపోతే సెక్షన్ 10ఎ కింద డిస్మిస్ చేసే అవకాశం ఉందన్నారు. రూల్ 88 అనుసరించి పబ్లిక్ కూడా ఎన్నికల ఖర్చు ను లెక్కించే అధికారం ఉన్నదని తెలిపారు. అకౌంటింగ్ టీమ్ లు ప్రత్యేకంగా ఎస్.ఓ.ఆర్ (షాడో ఆఫ్ రిజిస్టర్) ఎఫ్.సి (ఎవిడెన్స్) ఎప్పుటికప్పుడు పొందుపర్చడం జరుగుతుందని తెలిపారు. పెయిడ్ న్యూస్ ను ఎం.సి.ఎం.సి ద్వారా పరిశీలించి అనుకూల, విమర్శాత్మక వార్తల పై ఆర్.ఓ 96 గంటలలోపు ఎన్నికల అభ్యర్థికి నోటీసు అందిస్తారు. దానికి 48 గంటలలోపు అభ్యర్థి రిప్లే ఇవ్వాల్సి ఉంటుందని, అట్టి ఖర్చును అభ్యర్థి ఎన్నికల ఖాతాలో నమోదు చేస్తారని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులకు వంద నిమిషాలలోపు సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 15 నిమిషాల లోపు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఆ ప్రదేశానికి చేరుకొని 30 నిమిషాలలోపు రిపోర్ట్ ను ఆర్.ఓ కు అందించాలని తెలిపారు. ఆర్.ఓ 50 నిమిషాలలోపు సంబంధిత పిటీషన్ ను డ్రాప్ కానీ, డిస్పోస్ కానీ పై అధికారులకు సమర్పించాలని తెలిపారు. సి-విజిల్ యాప్ లో సిటీజన్స్ ఫోటో, వీడియో, ఆడియో ద్వారా తమ ఫిర్యాదులను తెలుపవచ్చని తెలిపారు. సుమోటో ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు కూడా ఫిర్యాదులను సి-విజిల్ లో పొందుపరచవచ్చు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు సి-విజిల్ ఇన్వెస్ట్ గేటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని సిద్దంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ,వీడియో సర్వేలెన్స్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts