telugu navyamedia
రాజకీయ వార్తలు

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్: ముస్లిం లా బోర్డు నిర్ణయం

ayodya case hearing will end tomorrow

అయోధ్య భూవివాదం తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్మానించింది. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం చర్చించేందుకు ఈ రోజు లక్నోలో బోర్డు సమావేశమైంది.

దీనిపై జమాయిత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని మాట్లాడుతూ, అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించలేదని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని, అయినప్పటికీ తమకు అక్కడ మసీదును ఇంతవరకు కేటాయించలేదని అన్నారు. అందుకే, వాస్తవంగా అక్కడ తమకు రావాల్సింది ఏమిటి అనేదానిపై స్పష్టత కోరుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు.

Related posts