telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ లో షో ను .. అనుకరిస్తూ.. బాలిక మృతి..! దీన్నిబట్టే తెలుస్తుంది.. ఎంతగా ఎడిక్ట్ అయ్యారో.. !!

Crime

పన్నేండేళ్ల బాలిక టీవీ షోను అనుకరిస్తూ మృత్యువాత పడింది.. టీవీలో వస్తున్నట్టు అక్టింగ్ చేస్తూ.. ఇతర పిల్లలను బయపెట్టబోయింది…అయితే అది హర్రర్ షో కావడంతో అచ్చు అలానే అనుకరించిన బాలిక.. షోలో చూపించినట్టుగా ఉరి పెట్టుకునే ప్రయత్నం చేసింది..అయితే ప్రమాదవశాత్తు తాడు బిగిసి మృత్యువాత పడింది. టీవీల ప్రభావం అంతా ఇంతా కాదనే చెప్పవచ్చు…పెద్దల నుండి పిల్లల వరకు టీవీ షోలకు అతుక్కుపోయి అచ్చు అలానే నిత్యజీవీతంలో కూడ అనుకరిస్తున్న సంఘటనలు కోకల్లలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిత్యం టీవీల్లో వస్తున్న కార్యక్రమాల ప్రభావం పిల్లల మీద మరి ఎక్కువగా పడుతుంది..దీంతో టీవీల్లో వచ్చిన సన్నివేశాలను అనుకరిస్తున్నారు. దీంతో అభం శుభం తెలియని పలువురు చిన్నారులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్‌లో ఓ టీవీ హర్రర్ షోకు 12 ఎళ్ల బాలిక బలైంది. రాష్ట్ర్రంలోని ఓ రియాలిటి హర్రర్ షో ప్రసారం అవుతుంది.

రాష్ట్రంలోని చాతర్‌పూర్‌కు చెందిన 12 సంవత్సరాల బాలిక, తన కుటుంభ సభ్యులతోపాటు ఇతర పిల్లలతో కలిసి హర్రర్ షోను చూస్తూంది..దీంతో షో వస్తున్న సన్నివేశాలను అనుకరిస్తుంది. షో చూపిస్తున్న సన్నివేశాల్లో ఉన్నటు అక్టింగ్ చేస్తూ తోటి పిల్లలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈనేపథ్యంలోనే హర్రర్ షోలో ఉరి పెట్టుకునే ఆత్మహత్య దృశ్యం వచ్చింది..అప్పటికే పిల్లలను భయపెడుతున్న బాలికి ఆ సీన్ చూసి వెంటనే పక్కరూంలోకి వెళ్లింది..టీవీలో చూపిస్తున్నట్టుగా స్టూల్ పై నిలబడి మెడకు ఉరి తాడు వేసుకుంది.. అనంతరం కాళ్ల క్రింద ఉన్న స్టూల్‌ను తన్నింది..దీంతో మెడకు ఉన్న తాడు టైట్ అయింది..దాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది..దీంతో ఆమే ఏడ్వడం ప్రారంభించింది..ఇక బాలిక చేస్తున్న అక్టింగ్‌కు పిల్లలు సైతం చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో వారికి ఎం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలోకి వెళ్లారు. వారు బాలిక పరిస్థితి చూస్తూనే ఎడుపును ప్రారంభించారు..

పిల్లల ఏడుపును విన్న బాలిక తల్లిదండ్రులు ఏం జరగుతుందంటూ… పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లారు.. దీనితో అప్పటికే అపస్మారక స్థితిలో బాలికను చూసి హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే బాలికను పరిశీలించిన వైద్యులు చనిపోయినట్టు ప్రకటించారు. తాడు గట్టిగా బిగుసుకుపోవడంతో బాలిక మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు దృవికరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పంచనామ నిర్వహించిన అనంతరం శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

Related posts