అల్లు అర్జున్ ఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్ అని దర్శకుడు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ‘ఆర్ఆర్ఆర్’ పని మీద ముంబయికి వెళ్లినప్పుడు ఎవరిని అడిగినా ‘పుష్ప కోసం చూస్తున్నాం’ అంటున్నారు. బన్నీ నువ్వు తప్పకుండా అక్కడ కూడా ప్రచారం చేయాలి. ప్రేక్షకులు అంతలా ఎదురు చూస్తున్నారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ‘పుష్ప’ కేవలం నీ సినిమా మాత్రమే కాదు. తెలుగు ఇండస్ట్రీ సినిమా.టీమ్ అంతా ఈ సినిమాను దేశవ్యాప్తంగా బాగా ప్రమోట్ చేయాలి.
ఈ సినిమా ఎంతదూరం వెళితే తెలుగు ఇండస్ట్రీకి అంత మంచి జరుగుతుంది. ‘పుష్ప’ టీజర్ చూసినప్పుడు కళ్లు చెదిరిపోయాయి. విజువల్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. చివరిగా అల్లు అర్జున్ డెడికేషన్, దర్శకుడిపై అతనికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్. నువ్వు ఇండస్ట్రీకి లభించిన గిఫ్ట్. అతడిని చూసి ఎంతో మంది స్ఫూర్తి అతడిని చూసి ఎంతో మంది స్ఫూర్తి అవుతారు.. ఎంత కష్టపడితే నీ అంత ఎదుగుతామని అనుకుంటారు. డిసెంబరు 17న పుష్ప విడుదల కానుంది. ఈ సినిమాను అందరూ థియేటర్ చూడండి అని చెప్పారు.