telugu navyamedia
సినిమా వార్తలు

నేను సంపాదించుకున్నది మిమ్మల్నే.. మీ కంటే ఏదీ ఎక్కువ కాదు..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. అల్లు అర్జున్ ఈవెంట్ లో తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానులని ఆక‌ట్టుకున్నారు. నేను సంపాదించుకున్నది మిమ్మల్నే.. మీ కంటే నాకు ఎక్కువ ఏదీ కాదు అని అన్నారు.‘రెండేళ్ల కష్టానికి ప్రతిరూపమిది. నాలుగు సినిమాల కష్టం ఒకే సినిమాకు పడిన భావన కలిగింది.

అలాగే దేవిశ్రీతో నా జర్నీ మొదలై ఇది మూడవ దశాబ్దం. ఈ చిత్రంలో ప్రతి సాంగ్ అద్భుతంగా కంపోజ్ చేశాడు దేవిశ్రీ. ప్రతి సాంగ్ దేనికదే విభిన్నంగా ఉంది. నేను స్వతహాగా మ్యూజిక్‌ లవర్‌ను. ఆయన స్వరపరచిన ప్రతి పాటను ఎంజాయ్‌చేశాను.

చాలా మందితో పనిచేస్తాం. కొంతమంది మాత్రమే మనసుకు నచ్చుతారు. అందులో రష్మిక మందన్న ఒకరు. వేదికపైనే రష్మికతో ‘ఏందీ పిల్ల నచ్చిననా ‘ అంటూ సరదాగా డైలాగ్ చెప్పి అలరించాడు .రాబోయే రోజుల్లో కథానాయికగా ఆమె మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది.

మైత్రీ మూవీస్‌ లేకపోతే ఈ సినిమా నిర్మాణం సాధ్యమయ్యేది కాదు. మా మావయ్యలు ముత్తంశెట్టి బ్రదర్స్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. దేవిశ్రీ, సుకుమార్‌గారు ఈ వేడుకకు రావడం లేదని తెలియగానే నిరాశపడ్డా. మంచి సినిమా ఇవ్వడానికి చివరి క్షణం వరకు కష్టపడతానని తన మాటగా చెప్పమని నాతో అన్నారు.

‘అఖండ’ విజయం పరిశ్రమకు ఊపునిచ్చింది. చాలా రోజులు తర్వాత ఫస్ట్‌బాల్‌కు సిక్సర్‌ కొట్టినంత ఉత్సాహాన్ని అందించింది. ఈ సక్సెస్‌ను ‘పుష్ప’ కొనసాగిస్తుంది. సినిమాలు గెలవాలి. శ్యామ్‌సింగరాయ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, భీమ్లానాయక్‌, రాధేశ్యామ్‌, ఆచార్యతో పాటు అన్ని సినిమాలు గొప్పగా ఆడాలి’ అని అన్నారు.

Related posts