టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు చెఫ్గా మారిపోయింది. తన కుటుంబ సభ్యుల కోసం సరికొత్త వంటలు తయారుచేసింది. ఆ వీడియోను తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. “మీకు ఏది సంతోషం ఇస్తుందో కనిపెట్టండి. మానసిక ప్రశాంతతను మించింది ఇంకేం లేదు. నా కుటుంబం కోసం వంట చేయడం నాకు ఆనందంగా ఉంది” అంటూ పూజా పేర్కొంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోకి వస్తున్నారు. మరికొందరు వంటగదిలో ప్రయోగాలు చేస్తూ సరికొత్త వంటకాలను పరిచయం చేస్తున్నారు.
previous post
ఆ సినిమా వలన అప్పులపాలయ్యా