telugu navyamedia
సినిమా వార్తలు

పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..కార‌ణం ఇదే

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర గ‌తంలో పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు . ఈ విషయం తెలుసుకున్న పూరిజగన్నాథ్ టీమ్ దిగ్బంతికి గురైంది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది

వివరాల్లోకి వెళితే ..

హైద్రాబాద్ లోని దుర్గంచెరువులో దూకి పూరి అసిస్టెంట్ డైరెక్టర్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా సాయి కుమార్. గతంలో పూరిజగన్నాథ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్టు తెలిసింది.

అయితే ఆర్థిక సమస్యల కారణంగా… అప్పుల బాధలు, ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైంది. అంచనాలు అందుకోవడం ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. అప్పటి నుంచి పూరి జగన్నాథ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన కంటే ఎక్కువగా ఛార్మీ కౌర్ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు కారణమా? మరొకటా? అనేది తెలియదు గానీ… సోషల్ మీడియాకు ఆమె బ్రేక్ ఇచ్చారు.

Related posts