నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీద ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే ప్రస్తుతం బోయపాటి,బాలయ్య కాంబినేషన్ సినిమా నిర్మిస్తున్నాడు రవీందర్ రెడ్డి. ఈ సినిమా మొదలయిన నాటి నుండి ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే రవీందర్ రెడ్డి మీద ఓ డిస్ట్రిబ్యూటర్ చీటింగ్ కేసు పెట్టారు. ఆరేళ్ల కిందటి కేసు ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అయితే కేసు విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఒక యూఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి సాహసం శ్వాసగా సాగిపో సినిమా నిమిత్తం యాభై లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. అయితే ఆ అగ్రిమెంట్ ని లెక్క చేయకుండా వేరే వారికి రైట్స్ అమ్మేసారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకున్న మొత్తం వెనక్కి ఇవ్వకుండా పది లక్షలు మాత్రమే ఇస్తానంటున్నారట. దీంతో సదరు డిస్ట్రిబ్యూటర్ కేసు వేయడంతో ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ప్రస్తుతం మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణతో తీస్తున్న సినిమా మే28న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
previous post
next post