telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోతులకు అరటిపళ్లు అందించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.రోడ్డుమార్గం ద్వారా కొండపైకి చేరుకున్న సీఎం అక్కడి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కుఆర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కేసీఆర్ పూజల అనంతరం వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం చేశారు.

అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుగుప్రయాణంలో సీఎం కేసీఆర్ గుట్టపై ఉన్న కోతులను చూసి వాహనం ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది తెచ్చిన అరటిపళ్లను ఆ కోతులకు అందించారు. కోతులు పెద్ద సంఖ్యలో ఉన్నా విసుక్కోకుండా వాటికి ఆహారం అందించి సంతృప్తి చెందారు.

Related posts