telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘నేనంటే ఇష్టమని అప్పుడే చెప్పచ్చుగా… ఏదో ఒకటి చేసేదాన్ని’ : శ్రద్ధా కపూర్

Shraddha

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ శ్రద్ధాను ప్రేమించారట. కానీ ఆమెతో ఈ విషయాన్ని చెప్పలేపోయారట. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ‘బాఘి 3’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టైగర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ఈ విషయం తెలిసి శ్రద్ధా కూడా షాకయ్యారు. ‘నేను శ్రద్ధా ఒకే స్కూల్లో చదువుకున్నాం. అప్పటినుంచే తనంటే నాకు ఇష్టం. కానీ నాకు ఈ విషయం తనకు చెప్పాలంటే చాలా భయం వేసింది. కేవలం తనని దూరం నుంచి చూస్తూ ఆనందించేవాడిని. తను నా పక్క నుంచి వెళ్తున్నప్పుడు గాలికి తన జుట్టు నన్ను తాకేది. అప్పట్లో నేను అంత ధైర్యవంతుడ్ని కాను. నాకు శ్రద్ధలో నచ్చని విషయాలు అంటూ లేవు. తనతో నచ్చే విషయాలు అడిగితే పెద్ద లిస్టే తయారు అవుతుంది’ అని తెలిపారు. ఈ మాటలన్నీ విన్న శ్రద్ధా.. ‘నేనంటే ఇష్టమని అప్పుడే చెప్పచ్చుగా. ఏదో ఒకటి చేసేదాన్ని’ అంటూ సెటైర్ వేసింది. అయినా ఇప్పుడు శ్రద్ధా.. రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నారట. కాబట్టి ఇప్పుడు టైగర్ ప్రపోజ్ చేసినా కూడా శ్రద్ధ ఒప్పుకునే స్థితిలో లేరనే చెప్పాలి. 2016లో వచ్చిన ‘బాఘి’ సినిమా మంచి విజయం అందుకుంది. మన తెలుగు బ్లాక్ బస్టర్ ‘వర్షం’కు ఈ సినిమా రీమేక్‌గా వచ్చింది. ఆ తర్వాత 2018లో ‘బాఘి 2’ వచ్చింది. ఇందులో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ నటించారు. ఈ సినిమాను కూడా మన నుంచే కాపీ కొట్టారు. ఇప్పుడు మూడో సీక్వెల్ రాబోతోంది. దీనికి టైటిల్ ‘బాఘి 3’ అని పెట్టారు. ఇందులో టైగర్‌కు జోడీగా మరోసారి శ్రద్ధా కపూర్ నటించారు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts