ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక పూరి విషయానికొస్తే… ఇప్పుడు “ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ `టెంపర్` గురించి ప్రస్తావించారు. అందులో క్యారెక్టర్ను ఎన్టీఆర్తో చేయించడం ఆనందంగా అనిపించిందని చెప్పిన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ.. “టెంపర్` సినిమాను ఎక్కువ భాగం గోవాలోనే చిత్రీకరించాం. ఆ సమయంలో కారులో తారక్తో జర్నీని మరచిపోలేను. తనతో రోజూ షూటింగ్కు వెళ్లేవాడిని. తను కారును తోలకుండా ఉండుంటే బావుంటుందిరా అనేంత స్పీడుగా డ్రైవ్గా చేస్తాడు” అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. మాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితోనూ కలిసి పని చేశారు.