ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తెలుగు, తమిళ భాషల్లో హిట్ అయిన “కాంచన” చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన “భరత్ అనే నేను” ఫేం కియారా అద్వాని కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి “లక్ష్మీ బాంబ్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రబృందం. దసరా శుభాకాంక్షలతో విడుదలైన ఫస్ట్ లుక్లో అక్షయ్ కుమార్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. సీరియస్గా కనిపిస్తూ అభిమానులలో అంచనాలు పెంచుతున్నాడు. జూన్ 5, 2020న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు అక్షయ్ ..రోహిత్ శెట్టి డైరెక్షన్లో “సూర్యవంశీ” అనే చిత్రాన్ని చేస్తున్నాడు. 2020 ఈద్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
First look of @akshaykumar from #LaxmmiBomb Directed by @offl_Lawrence pic.twitter.com/LIU1UiiZka
— BARaju (@baraju_SuperHit) October 3, 2019
సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా